Friday, 11 September 2015

ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు


శ్రీమంతుడు’ సినిమాతో రికార్డు బ్రేకింగ్‌ సక్సెస్‌ను అందుకున్న మహేష్‌బాబు తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా చిత్రీకరణ ఈనెల 16 నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది జులై 10నే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా మహేష్‌కు ఇతర పను ఉండటం వల్ల షూటింగ్‌ ప్రారంభం వాయిదా వేశారు తాజాగా ఈ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ చిత్రం అంటున్నారు. ఈ చిత్ర కథ కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబుకు ముగ్గురు మేనత్తలు ఉంటారు అని, ఆ ముగ్గురు అత్తలకు కూడా ముగ్గురు కూతుర్లు ఉంటారు. ఆ ముగ్గురు అత్తల చుట్టు తిరిగే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. కుటుంబ విలువలు పుష్కలంగా ఉండే ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు సమంత, కాజల్‌, ప్రణీతలు నటించనున్నారు. మొదటి సారి ముగ్గురు ముద్దుగుమ్మలతో మహేష్‌బాబు చేయబోతున్న రొమాన్స్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. .

No comments:

Post a Comment